సుధా చంద్రన్
సుధా చంద్రన్ (జననం 27 సెప్టెంబర్ 1965) ఒక భారతీయ భరతనాట్యం నర్తకి మరియు భారతీయ టెలివిజన్ మరియు చలనచిత్రాలలో కనిపించే నటి. 1981లో, తమిళనాడులోని తిరుచిరాపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తన తల్లిదండ్రులతో మద్రాసు నుండి తిరిగి వస్తుండగా ఆమె కుడి కాలికి గాయమైంది.
వైద్యులను సంప్రదించగా వారు ఆ గాయం కారణంగా ఆమె కాలు తొలగించుటే సరియైన మార్గం అని చెప్పారు. ఆమెకు ఒక కాలిని తొలగించారు. ఆమె జైపూర్ లో వైద్యులు 'జైపూర్ కాలు' ను కృత్రిమంగా అమర్చారు. అయినప్పటికీ, ఆమె తరువాత భరతనాట్యం నర్తకిగా స్థిరపడింది. ఆమె రెండు సంవత్సరాల విరామం తర్వాత తిరిగి నాట్యం చేసింది మరియు భారతదేశం, సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్ కెనడా, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ప్రదర్శన ఇచ్చింది. సుధా చంద్రన్ 1994లో అసిస్టెంట్ డైరెక్టర్ రవి డాంగ్ని వివాహం చేసుకున్నారు. ఆమెకు బరేలీలోని ఇన్వర్టిస్ విశ్వవిద్యాలయంగౌరవ డాక్టరేట్ ఇచ్చింది .

Comments
Post a Comment